బంద్ ఆపేది లేదు… దేనికైనా రెడీ అంటున్న జెఎసీ

రేపటి తెలంగాణ బంద్‌పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత14 రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగా 19 వతేదీన రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల తర్వాత కూడా బంద్ ఆగే […]

బంద్ ఆపేది లేదు... దేనికైనా రెడీ అంటున్న జెఎసీ
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 18, 2019 | 6:18 PM

రేపటి తెలంగాణ బంద్‌పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత14 రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగా 19 వతేదీన రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల తర్వాత కూడా బంద్ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టు తమ న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలని చర్చలకు పిలవడం లేదంటూ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 10.30కు చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించిన మీదట చర్చలు జరుగుతాయా? లేదా అని ఉత్కంఠగా మారింది.

అయితే తమ డిమాండ్లలో ప్రధానమైన ఆర్టీసీ విలీనంతో పాటు అనేక అంశాలపై చర్చల ద్వారానే పరిష్కారం లభించగలదని కార్మిక సంఘ నేతలు మొదటినుంచి భావిస్తున్నారు. అయితే సమ్మెకు దిగడంతో రాష్ట్రప్రభుత్వం .. 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం.. కార్మికుల్లో నైరాశ్యాన్ని నింపింది. అయితే హైకోర్టులో జరిగిన వాదనల్లో ప్రభుత్వ వైఖరిపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోరాటి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదంటూ ప్రధాన న్యాయమూర్తి పేర్కొనడం కూడా ఒక కీలకమైన అంశమే.

ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఇవ్వకపోవడం, ఆర్టీసీ హాస్పిటల్‌ను పునురుద్దరించకపోవడం, పూర్తి స్దాయిలో ఎండీని నియమించకపోవడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. అయితే వీటికి ప్రభుత్వ తరపున అడ్వొకేట్ జనరల్ వినిపించిన వాదనలపై న్యాయస్ధానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆర్టీసీ చేపట్టిన సమ్మెకు ప్రజల సంపూర్ణ మద్దతు ఇస్తే.. దాన్ని ఎవరూ ఆపలేరన్న కోర్టు.. వెంటనే చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకుని చర్చలు జరుపుతుందా? లేదా అన్ని మరో ప్రశ్నగా మారింది. మూడు రోజుల్లో చర్చలు జరిపాలంటూ ఆదేశించింది. పైగా ఈనెల 28 నాటికి చర్చల సారాంశాన్ని తమకు తెలియజేయాలని కూడా చెప్పింది. అయితే చర్చలపై కోర్టు ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగానే రేపు తెలంగాణ బంద్ యధావిధిగా కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ బంద్‌కు అధికార టీఆర్ఎస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలన్నీ మద్దతు ఇవ్వడంతో బంద్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.