ఈనెల 19న తెలంగాణ బంద్?

ఆర్టీసీ సమ్మెను మరింత ఉద‌ృతం చేసేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. తన డిమాండ్ల పరిష్కారం కోసం ఐదురోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, నేతలు నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. నేడు మరోసారి విపక్షాలతో ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ కానున్నారు. తెలంగాణ బంద్‌పై నేటి మధ్యాహ్నం స్పష్టటతో పాటు ప్రకటన చేయనున్నారు. తెలంగాణ ఆర్టీసీ సమస్యలపై జరిగిన […]

ఈనెల 19న తెలంగాణ బంద్?
Follow us

|

Updated on: Oct 10, 2019 | 4:55 AM

ర్టీసీ సమ్మెను మరింత ఉద‌ృతం చేసేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. తన డిమాండ్ల పరిష్కారం కోసం ఐదురోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, నేతలు నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. నేడు మరోసారి విపక్షాలతో ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ కానున్నారు. తెలంగాణ బంద్‌పై నేటి మధ్యాహ్నం స్పష్టటతో పాటు ప్రకటన చేయనున్నారు.

తెలంగాణ ఆర్టీసీ సమస్యలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతల్ని ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదన్నారు. ఆర్టీసీని బతికించుకోవడమే తమ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు

ఇక ఈ భేటీలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే ఆర్టీసీ సమ్మె అనివార్యమైందని పేర్కొన్నారు. తక్షణమే విలీన ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని.. అన్ని పార్టీలు దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.