ఈనెల 30న గురుకుల ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్ష
తెలంగాణలోని గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు గురుకుల విద్యాసంస్ధల కార్యదర్శి వెల్లడించారు.
తెలంగాణలోని గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు గురుకుల విద్యాసంస్ధల కార్యదర్శి వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా పరీక్ష నిర్వహణ అంతరాయం ఏర్పడింది. అయితే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాత్మా జ్యోతిఆపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాదయాల సంస్థ జూనియర్, మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 30న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రవేశాల కొరకు దరఖాస్తుచేసుకున్న విద్యార్ధినీ విద్యార్ధులకు 10 జిల్లాలకు బదులుగా 33 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాసంస్థల కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించి అభ్యర్ధులు హాల్టికెట్లను ఈనెల 24వ తేదీ నుంచి సంస్థ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని గురుకుల విద్యాసంస్ధల కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు.