Breaking: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
రాష్ట్రంలోని పాత సచివాలయం భవనాలను కూల్చేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు ఆరు నెలలుగా సచివాలయం కూల్చివేతపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
రాష్ట్రంలోని పాత సచివాలయం భవనాలను కూల్చేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు ఆరు నెలలుగా సచివాలయం కూల్చివేతపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. చివరికి ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. కొత్త సచివాలయం నిర్మాణానికి అనుమతించింది. కేబినెట్ నిర్ణయాన్ని తాము తప్పుబట్టలేమని పేర్కొన్న హైకోర్టు.. సచివాలయం కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్లను కొట్టిపారేసింది.
ఇది చదవండి: ఆ 5 లక్షల మందికి ‘రైతు బంద్’.. తెలంగాణ సర్కార్ నిర్ణయం..