గవర్నర్ నరసింహన్కు స్వల్ప అస్వస్థత
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమం నిమిత్తం.. ఆయన సతీమణితో కలిసి బీహార్లోని గయ పర్యటనకు వెళ్లారు. సోమవారం అకస్మాత్తుగా వాంతులు కావడంతో.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను సమీపంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ముందు జాగ్రత్తగా రక్తపరీక్ష, ఈసీజీ నిర్వహించారు. ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించుకున్న తర్వాత గవర్నర్ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన […]
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమం నిమిత్తం.. ఆయన సతీమణితో కలిసి బీహార్లోని గయ పర్యటనకు వెళ్లారు. సోమవారం అకస్మాత్తుగా వాంతులు కావడంతో.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను సమీపంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ముందు జాగ్రత్తగా రక్తపరీక్ష, ఈసీజీ నిర్వహించారు. ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించుకున్న తర్వాత గవర్నర్ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.