నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడన్యూస్
తెలంగాణ సర్కార్ నిరుద్యోగలుకు శుభవార్త ప్రకటించింది. పురపాలకశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్ల నియామానికి ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ సర్కార్ నిరుద్యోగలుకు శుభవార్త ప్రకటించింది. పురపాలకశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్ల నియామానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ శుక్రవారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న సీఎం ఆలోచనల మేరకు నూతన పురపాలక చట్టానికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీని చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్లు సమాచారం. అలాగే ఉద్యోగాల నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలన్నారు.
ఉద్యోగాల భర్తీ తరువాత అయా వార్డుల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వర నిర్ణయం తీసుకోవచ్చని ఈ సందర్భంగా నిర్ణయించారు. అంతేకాకుండా వేగంగా పౌరసేవలు అందించడంతో పాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతమవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారథులుగా వార్డు ఆఫీసర్ల నియామాకం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. వార్డుకు ఒక అధికారి ఉండటం దేశంలోనే మొదటిసారి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, దాన కిశోర్ తదితరులు పాల్గొన్నారు.