కరోనా అప్డేట్ : తెలంగాణలో కొత్తగా 1,539 కేసులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 1539 మందికి కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం 2,45,682 మందికి వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 1539 మందికి కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం 2,45,682 మందికి వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 5 మంది వైరస్ కారణంగా మృతి చెందగా… మొత్తం కరోనా మరణాలు 1362కి పెరిగాయి. కొత్తగా 978మంది కోలుకోగా… మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,25,664 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18656 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక కొత్తగా జీహెచ్ఎంసీ అత్యధికంగా 285 కేసులు నమోదయ్యాయి. రంగరెడ్డి 123, మల్కాజిగిరి 102, కరీంనగర్ 86, కొత్తగూడెం 82, ఖమ్మం 78, నల్గొండ 69, సూర్యాపేట 52, వరంగల్ అర్బన్ 46, జగిత్యాల 45, మహబూబ్నగర్ 43, సంగారెడ్డి 40, పెద్దపల్లి 39, సిద్దిపేట 38, నిజామాబాద్ 37, కామారెడ్డి 36, మంచిర్యాల 33, నాగర్కర్నూల్ 33, సిరిసిల్ల 33, ములుగు 32, వరంగల్ రూరల్ 29, మెదక్ 23, భువనగిరి 23, జనగామ 22, మహబూబాబాద్ 21, నిర్మల్ 20, ఆదిలాబాద్ 14, జోగులాంబ గద్వాల 13, వనపర్తి 13, వికారాబాద్ 12, భూపాలపల్లి 12, ఆసిఫాబాద్ 04, నారాయణపేట్ 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read :
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !
ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం