తెలంగాణలో కొత్తగా 1550 కరోనా కేసులు.. 9 మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో (ఈ రోజు సాయంత్రం ఐదు వరకు) రాష్ట్రంలో 1,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో (ఈ రోజు సాయంత్రం ఐదు వరకు) రాష్ట్రంలో 1,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,221కి చేరింది. గత 24 గంటల్లో 11,525 టెస్టులు చేయగా… ఇప్పటివరకు 1,81,849 శాంపిల్స్ పరీక్షించారు. ప్రస్తుతం 12,178 మంది యాక్టీవ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 23,679 మంది వ్యాధి నుంచి కోలుకోని డిశ్ఛార్జి అవ్వగా… ఈ రోజు డిశ్ఛార్జి అయినవారి సంఖ్య 1,197. కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ రోజు తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 365 మంది మృతి చెందారు.
ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 926 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ లో 53 మందికి కరోనా సోకింది. సంగారెడ్డి 19, ఖమ్మం 38, కామారెడ్డి 33, వరంగల్ అర్బన్ 16, వరంగల్ రూరల్ 8 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కొత్తగా 86 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. మిగతా జిల్లాల కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి…