ఇకపై రైతులు ఏ రకమైన పంటలు వేయాలో ప్రభుత్వం త్వరలోనే చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేసే రైతులకే రైతుబంధు ఇవ్వాలని.. వాటినే మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలన్నారు. ఈ ఏడాది వరి పంటతోనే పంటల మార్పిడి మొదలు కావాలన్నారు.
రాష్ట్రంలో పంటల మార్పిడి, పంటల కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మీదట అందరూ ఒకే రకమైన పంటలు వేసే విధానాన్ని మార్చుకోవాలన్నారు. అంతా ఒకే పంట వేస్తే గిట్టుబాటు ధర రాదని, మార్కెట్ డిమాండ్కు తగ్గట్లు పంటలు వేయాలన్నారు.
రైతులు ఏ పంట వేస్తే లభాపడతారన్న విషయాన్ని ప్రభుత్వమే చెబుతుందని.. ఇకపై విత్తనాలు ఆ పంటలకు సంబంధించినవే రాయితీపై అమ్మే విధంగా విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఆదేశాలిస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే ఈ సంస్థ అందుబాటులో ఉంచుతుంది. ఈ అంశంపై చర్చించడానికి సీడ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు.
Read This: కిమ్ లైఫ్స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!
రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే ఈ సంస్థ అందుబాటులో ఉంచుతుంది. ఈ అంశంపై చర్చించడానికి సీడ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు.
— Telangana CMO (@TelanganaCMO) May 12, 2020
Govt has decided to regulate the crop patterns with the sole intention of making agriculture profitable. Farmers are requested to cultivate crops as suggested by the Govt. The regulation of crops will begin with Paddy from monsoon: CM Sri KCR. See more at: https://t.co/F4v1mrtrRM pic.twitter.com/Nv0M9zEEmb
— Telangana CMO (@TelanganaCMO) May 12, 2020