తెలంగాణలో కొత్తగా 6 ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 3,500 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఆధ్వర్యంలో కామన్ బోర్డు ఏర్పాటు చేసి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.
దీంతోపాటు కొత్త ఆరు యూనివర్సిటీలకు కేబినెట్ అనుమతినిచ్చింది. కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆమోదం లభించింది. అలాగే, అమిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), గురునానక్, నిప్మర్, ఎంఎన్ఆర్ యూనిర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాలను సంబంధిత మంత్రులే చూసుకుంటారని చెప్పారు. అలాగే, ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయని సీఎం కేసీఆర్ వివరించారు.