గుంటూరు జిల్లాలో కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి..
ఆంధ్రాలో కోవిడ్-19 రోజురోజుకు ప్రమాదకరంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అన్ని జిల్లాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఆదివారం ఏకంగా 5వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రాలో కోవిడ్-19 రోజురోజుకు ప్రమాదకరంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అన్ని జిల్లాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఆదివారం ఏకంగా 5వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 4,5 రోజుల నుంచి మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ప్రమాదకర వైరస్ సామాన్య ప్రజలనే కాదు.. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ని సైతం కబలిస్తోంది. అయితే తాజాగా ఈ మహమ్మారికి గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత బలయ్యారు.
సంగం డైయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు కోవిడ్ కారణంగా మృతి చెందారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన గత కొద్ది రోజులుగా ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. కృష్ణారావుది సత్తెనపల్లి మండలం భట్లూరు కాగా.. సత్తెనపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతిపై పలువురు టీడీపీ నేతులు సంతాపాన్ని ప్రకటించారు.