‘విశాఖలో రాజధాని పేరిట జగన్ అండ్ కో వేల ఎకరాల భూకబ్జా’.. ఏపీ టీడీపీ రివర్స్ అటాక్.!
విశాఖలో రాజధాని పేరుతో వేల ఎకరాల భూకబ్జాలకు జగన్ అండ్ కో పాల్పడిందని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వారి తప్పులను కప్పిపుచ్చు..
విశాఖలో రాజధాని పేరుతో వేల ఎకరాల భూకబ్జాలకు జగన్ అండ్ కో పాల్పడిందని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు పీలా గోవింద్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై బురదజల్లుతున్నారని, ఇది వారి దివాలకోరుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి టీడీపీ హయాంలో హ్యాపీ సండేస్ నిర్వహిస్తే వైసీపీ హయాంలో వారాంతాల్లో విధ్వంసాలకు పాల్పడతున్నారని ఎద్దేవా చేశారు. వెలగపూడి రామకృష్ణబాబు భూమి విషయం.. కోర్టు పరిధిలో ఉండగా.. ప్రభుత్వం ఏవిధంగా జోక్యం చేసుకుంటుంది? అని ఆయన ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, భూకబ్జాలపై జగన్ అండ్ కో ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పీలా గోవింద్ కు సంబంధం లేకపోయినా వైసీపీ పేటిఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు.