తమిళనాడు కోయంబత్తూరులో ఇంటర్ ఫస్టియర్ అమ్మాయి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు స్నేహితుడితో కలిసి ఒక పార్కుకు వెళ్లింది. ఆ పార్కులోనే బర్త్ డే వేడుకలు జరుపుకుంది. రాత్రి 9 గంటలకు అతనితో ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ ముఠా వారిని వెంబడించింది. వారు బాలిక స్నేహితుడి పై దాడి చేసి, ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. వారు ఈ సంఘటనను వీడియో కూడా తీసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురించి మరుసటి రోజు ఆ అమ్మాయి తన తల్లికి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.