Harsha Bhogle: హర్షా భోగ్లే టీ20 జట్టు.. ఇండియా నుంచి ఒక్కరు కూడా లేరు.. వార్నర్కూ దక్కని చోటు..
ప్రముఖ భారతీయ వ్యాఖ్యాత హర్షా భోగ్లే టీ20 వరల్డ్ తర్వాత తన టీ20 జట్టు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. అయితే అతని జట్టులో వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పొందిన డేవిడ్ వార్నర్కు చోటు కల్పించలేదు...
ప్రముఖ భారతీయ వ్యాఖ్యాత హర్షా భోగ్లే టీ20 వరల్డ్ తర్వాత తన టీ20 జట్టు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. అయితే అతని జట్టులో వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పొందిన డేవిడ్ వార్నర్కు చోటు కల్పించలేదు. ఇక ఇండియా నుంచి ఒక్కరు కూడా భోగ్లే ప్లేయింగ్ ఎలెవన్లో కనిపించలేదు. న్యూజిలాండ్ నుంచి కూడా ఒక్కరిని కూడా ఎంపిక చేయలందు. ఆస్ట్రేలియా నుంచి ఒక్కడిని తీసుకున్నాడు. భోగ్లే తన జట్టు సెమీఫైనల్ దశ వరకు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేశాడు.
“ఇది సెమీ-ఫైనల్ దశ వరకు ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన జట్టు. తద్వారా ఇది ప్రతిఒక్కరికీ స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్” అని భోగ్లే క్రిక్బజ్లోని వీడియోలో తెలిపారు. భోగ్లే యొక్క మొదటి ఎంపిక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను ఎంచుకున్నాడు. బాబర్ ఆరు మ్యాచ్ల్లో 303 పరుగుల చేశాడు. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆజంతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించడానికి వాష్బక్లింగ్ ఇంగ్లీష్ బ్యాటర్ జోస్ బట్లర్ను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ను మూడో స్థానానికి, శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక నాలుగో స్థానానికి భోగ్లే ఎంపిక చేశారు.
అతను తన ఐదవ నెంబర్ బ్యాటర్గా వెటరన్ పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ను ఎంచుకున్నాడు. భోగ్లే తన ప్లేయింగ్ XIలో ముగ్గురు ఆల్ రౌండర్లకు చోటు కల్పించారు. ఇంగ్లండ్కు చెందిన మొయిన్ అలీ, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా, నమీబియాకు చెందిన డేవిడ్ వైస్ను ఎంపిక చేసుకున్నాడు. అసోసియేట్ దేశం నుండి భోగ్లే యొక్క టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లోకి ప్రవేశించిన ఏకైక ఆటగాడు వైస్. భోగ్లే తన జట్టులో ముగ్గురు పేస్ బౌలర్లకు చోటు కల్పించాడు. పాకిస్తాన్కు చెందిన షాహీన్ అఫ్రిది, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్వుడ్, దక్షిణాఫ్రికాకు చెందిన అన్రిచ్ నార్ట్జేలను ఎంపిక చేసుకున్నాడు.