రిషికేష్లో స్వరూపానంద స్వామి దీక్ష
ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ దీక్ష కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్కు వెళ్లనున్నారు. అక్కడ 2 నెలల 20 రోజులపాటు దీక్ష చేయనున్నారు. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో 15రోజులపాటు తపస్సు చేస్తారు. అనంతరం రిషికేష్లో శారదాపీఠానికి చేరుకుని ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేయనున్నారు. భక్తులెవరు అక్కడకు రావద్దని, సెప్టెంబర్ 20 తర్వాత అనుమతి ఇవ్వాల్సిందిగా స్వామి […]
ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ దీక్ష కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్కు వెళ్లనున్నారు. అక్కడ 2 నెలల 20 రోజులపాటు దీక్ష చేయనున్నారు. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో 15రోజులపాటు తపస్సు చేస్తారు. అనంతరం రిషికేష్లో శారదాపీఠానికి చేరుకుని ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేయనున్నారు. భక్తులెవరు అక్కడకు రావద్దని, సెప్టెంబర్ 20 తర్వాత అనుమతి ఇవ్వాల్సిందిగా స్వామి తెలిపారు.
మరోవైపు ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కేదార్, గంగోత్రి, యమునోత్రిలో 15 రోజులపాటు తపస్సు అనంతరం రిషికేష్లోని శారదా పీఠానికి చేరుకుంటారు.