సంచలన పాత్రలో సన్నీలియోన్.. ఈసారి ఏం చేయబోతోందంటే.. ?
ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన కొద్దికాలంలోనే టాప్ సెలెబ్రెటీగా వెలిగిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడంతో ఎరోటిక్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా మారింది సన్నీ లియాన్. వరుస సినిమాలు వీలు చిక్కినప్పుడల్లా ప్రత్యేక గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ‘స్ల్పిట్స్విల్లా సీజన్ 12’ సిరీస్తో బిజీగా ఉన్న సన్నీ లియాన్ త్వరలోనే ఓ వెబ్ సిరీస్లో […]
ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన కొద్దికాలంలోనే టాప్ సెలెబ్రెటీగా వెలిగిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడంతో ఎరోటిక్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా మారింది సన్నీ లియాన్. వరుస సినిమాలు వీలు చిక్కినప్పుడల్లా ప్రత్యేక గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ‘స్ల్పిట్స్విల్లా సీజన్ 12’ సిరీస్తో బిజీగా ఉన్న సన్నీ లియాన్ త్వరలోనే ఓ వెబ్ సిరీస్లో నటించనున్నారని బాలీవుడ్ టాక్. అదీ కూడా ఫుల్ ‘ఏ’ సర్టిఫికెట్ సిరీస్ అని బీ టౌన్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్ దర్శకురాలు ఏక్తాకపూర్ వాత్సాయన ‘కామసూత్ర’ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్లో నటించడానికి సన్నీలియోన్తో సంప్రదింపులు జరిపారట. ఇక ఇందులో నటించేందుకు సన్నీ కూడా సుముఖతతో ఉన్నారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఏక్తా కపూర్, సన్నీ లియోన్ల కాంబినేషన్లో ఇదివరకే ‘రాగిణి ఎంఎంఎస్ 2’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సన్నీ లియోన్ ప్రస్తుతం తమిళంలో ‘వీరమాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.