ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ
దేశంలో నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. జాతీయ విద్యా విధానంలో 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ఇకపై బోర్డు పరీక్షల ప్రాధాన్యం తగ్గిస్తూ
దేశంలో నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. జాతీయ విద్యా విధానంలో 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ఇకపై బోర్డు పరీక్షల ప్రాధాన్యం తగ్గిస్తూ.. నైపుణ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోనుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు విద్యార్థులు రిపోర్టు కార్డులు, మార్కుల ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండాలని పేర్కొంది.
నూతన విద్యా విధానంలో.. కళలు, కథలు, కవితలు, ఆటలు, పాటలు…. ఇలాంటి అంశాలను తగిన విధంగా సిలబస్ లో చేర్చుతారు. ఈసీసీఈని సమర్థంగా అమలు చేసేందుకు వీలుగా… అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, ప్రీప్రైమరీ పాఠశాలలు, ప్రీ-స్కూల్స్ను బలోపేతం చేస్తారు. అందులో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లల శారీరక, మానసిక వికాసంతోపాటు… మొత్తంగా సామాజిక, ఆర్థిక, భావోద్వేగ, నైతిక, సాంస్కృతికమైన అభివృద్ధి, కళలపట్ల ఆసక్తి, భావ ప్రకటన సామర్థ్యంలో అభివృద్ధి సాధించాలన్నది ఈసీసీఈ లక్ష్యం. దీనికి అనుగుణంగా 8 ఏళ్ల వయసు పిల్లలకు అవసరమైన కరిక్యులంను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తుంది.
Read More:
గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్ పోస్టుల భర్తీ!
జీహెచ్ఎంసీలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు.. గంటకు 500 పరీక్షలు..!