రోహిత్ ఇన్.. బుమ్రా రెస్ట్
టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియం గార్గ్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వార్నర్ వెల్లడించాడు. తొడకండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్లకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ మళ్లీ జట్టు పగ్గాలు...
SRH Have Win The Toss : రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్ తుది అంకానికి చేరింది. షార్జా వేదికగా లీగ్ దశలోని ఆఖరి మ్యాచ్లో ముంబయి, హైదరాబాద్ తలపడుతున్నాయి. గత రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై అద్భుత విజయాలతో ఫుల్జోష్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్…టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్తో అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సన్రైజర్స్ ప్లేఆఫ్ చేరుతుంది. ఇక మరోవైపు ముంబయి ఈ పోరులో గెలిచి లీగ్ మ్యాచ్లను విజయంతో ముగించాలని భావిస్తోంది.
టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియం గార్గ్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వార్నర్ వెల్లడించాడు. తొడకండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్లకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. ముంబై పేసర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్కు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్ తెలిపాడు.
ముంబై జట్టు సభ్యులు : రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, సౌరభ్ తివారి, ఇషాన్ కిషన్. పొలార్డ్, కృనాల్ పాండ్య, కౌల్డర్నైల్, రాహుల్ చాహర్, కులకర్ణి, ప్యాటిన్సన్
హైదరాబాద్ జట్టు సభ్యులు : వార్నర్ (కెప్టెన్), సాహా, మనీష్ పాండే, విలియమ్సన్, గార్గ్, హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్