తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!
దక్షిణ మధ్య రైల్వే 42 స్పెషల్ ట్రైన్స్ను తిప్పనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలోనే నడవనున్నాయి.
Festival Special Trains: రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా దేశవ్యాప్తంగా 392 స్పెషల్ ట్రైన్స్ను అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు పట్టాలెక్కించనుంది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే 42 స్పెషల్ ట్రైన్స్ను తిప్పనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలోనే నడవనున్నాయి. వీటిల్లో కొన్ని వారానికి 2,3 రోజులు నడవనుండగా.. మరికొన్ని రోజూ నడుస్తాయి. ఇంకొన్ని వీకెండ్లలో నడిచే రైళ్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య నారాయణాద్రి, గౌతమి, శబరి, చార్మినార్, బెంగళూరు, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపబోతోంది. అంతేకాకుండా వీటి టికెట్ ధరలు సాధారణ రైళ్ల కంటే 10-30 శాతం మేర ఎక్కువగా ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఇవే..
ప్రతీ రోజూ నడిచే ట్రైన్స్… తిరుమల ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్, గౌతమి ఎక్స్ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్, చార్మినార్ ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, హుబ్లీ ఎక్స్ప్రెస్
వారంలో ఐదు రోజులు.. విశాఖపట్నం – విజయవాడ డబుల్ డెక్కర్ ట్రైన్
వారానికి మూడు రోజులు.. రాజ్కోట్ ఎక్స్ప్రెస్
వారానికి రెండు రోజులు… జైపూర్ ఎక్స్ప్రెస్(వయా నాందేడ్), తిరుపతి-అమరావతి(మహారాష్ట్ర)
వారానికి ఒక రోజు.. గౌహతి ఎక్స్ప్రెస్, భువనేశ్వర్-తిరుపతి(వయా విజయవాడ), విజయవాడ-హుబ్లీ ఎక్స్ప్రెస్.. వీటితో పాటు మరికొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదగా నడుస్తాయి.
Also Read: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు!