AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్ట‌న్నింగ్ న్యూస్… ఆంధ్రా సహా మూడు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు ముప్పు..!

కరోనావైర‌స్ మహమ్మారి యావ‌త్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. దాదాపు అన్నీ రంగాలు ఈ వైర‌స్ ధాటికి ఆర్థికంగా దెబ్బ‌తిన్నాయి. భార‌త్ లో కూడా ఈ డేంజ‌రస్ వైర‌స్ ప్ర‌భావం అధికంగానే ఉంది. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో దాదాపు అన్నీ రంగాలు కుదేలయ్యాయి. అయితే కోవిడ్-19 ప్రభావాన్ని ఎప్పటికప్పుడు స‌మీక్షిస్తోన్న‌ దేశీయ రేటింగ్ సంస్థ క్రిసిల్..తాజాగా కొన్ని స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ చేసింది. కోవిడ్-19 వ్యాప్తి భయాలతో ఇండియాలో విధించిన లాక్ డౌన్.. […]

స్ట‌న్నింగ్ న్యూస్... ఆంధ్రా సహా మూడు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు ముప్పు..!
Ram Naramaneni
|

Updated on: May 20, 2020 | 3:52 PM

Share

కరోనావైర‌స్ మహమ్మారి యావ‌త్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. దాదాపు అన్నీ రంగాలు ఈ వైర‌స్ ధాటికి ఆర్థికంగా దెబ్బ‌తిన్నాయి. భార‌త్ లో కూడా ఈ డేంజ‌రస్ వైర‌స్ ప్ర‌భావం అధికంగానే ఉంది. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో దాదాపు అన్నీ రంగాలు కుదేలయ్యాయి.

అయితే కోవిడ్-19 ప్రభావాన్ని ఎప్పటికప్పుడు స‌మీక్షిస్తోన్న‌ దేశీయ రేటింగ్ సంస్థ క్రిసిల్..తాజాగా కొన్ని స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ చేసింది. కోవిడ్-19 వ్యాప్తి భయాలతో ఇండియాలో విధించిన లాక్ డౌన్.. అప్పటికే రెవెన్యూ లోటుతో ఎదుర్కొంటూ, భారీ అప్పుల్లో కూరుకుపోయిన కొన్ని రాష్ట్రాల పాలిట శాపంగా మార‌బోతుంద‌ని ఈ సంస్థ అంచనా వేసింది. ఆయా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోవ‌డంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీసుకున్నట్లయిందని వెల్ల‌డించింది.

ఈ మూడు రాష్ట్రాల‌లో ఎఫెక్ట్ ఎక్కువ‌:

మద్యం అమ్మకాలు, పెట్రోలియం, స్టాంప్ డ్యూటీలపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్ధాన్ వంటి రాష్ట్రాల్లో ఉపాధిపై అధిక ప్రభావం పడబోతోందని తెలిపింది. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు జాతీయ‌ ఉత్పత్తిలో 65.5 శాతం వాటా కలిగి ఉన్నాయి. నిర్మాణ రంగంలో కూడా ఈ రాష్ట్రాల వాటా 60 శాతంగా ఉందని క్రిసిల్ పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా ఈ రాష్ట్రాల్లో వ‌స్తువోత్ప‌త్తితో పాటు నిర్మాణ రంగం దెబ్బ‌తిన‌డంతో ఆర్ధిక వ్యవస్ధలపై తీవ్ర‌ ప్రభావం తప్పదని హెచ్చరించింది.