ట్రైనీ ఐఏఎస్‌లకు సిరిసిల్ల జిల్లా జల విధానంపై పాఠాలు..!

ఐఏఎస్‌ శిక్షణ అకాడమీలో శిక్షణ అంశంగా సిరిసిల్ల జిల్లా ఎంపికకావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జల నిర్వహణ నమూనాకు దక్కిన మరో గుర్తింపు అని కొనియాడారు. ప్రభుత్వ పాలసీలు, విధానాలకు జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రశంసలు వచ్చాయి. తెలంగాణ జల విధానంపై అధ్యయనాలు జరుగుతాయని గతంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం సిరిసిల్లకు సాగునీటి ప్రాజెక్టుల […]

ట్రైనీ ఐఏఎస్‌లకు సిరిసిల్ల జిల్లా జల విధానంపై పాఠాలు..!
Follow us

|

Updated on: May 27, 2020 | 7:49 PM

ఐఏఎస్‌ శిక్షణ అకాడమీలో శిక్షణ అంశంగా సిరిసిల్ల జిల్లా ఎంపికకావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జల నిర్వహణ నమూనాకు దక్కిన మరో గుర్తింపు అని కొనియాడారు. ప్రభుత్వ పాలసీలు, విధానాలకు జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రశంసలు వచ్చాయి. తెలంగాణ జల విధానంపై అధ్యయనాలు జరుగుతాయని గతంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం సిరిసిల్లకు సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు అందడం ప్రారంభమైంది. భవిష్యత్‌లో దేశంలోనే ఆదర్శవంతమైన జల నిర్వహణకు చిరునామాగా సిరిసిల్ల జిల్లాను నిలిపే ప్రయత్నం చేస్తామని’ కేటీఆర్‌ తెలిపారు. ఐఏఎస్‌ ట్రైనీలకు సిరిసిల్ల జిల్లా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ మోడల్‌ పాఠాలు. జాతీయ స్థాయిలో ఆదర్శంగా సిరిసిల్ల జిల్లా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ మోడల్‌ను శిక్షణ అంశంగా ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎంచుకుంది. క్షేత్రస్థాయిలో జిల్లాను పరిశీలించేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలోని కార్యక్రమాలు డాక్యుమెంట్‌ చేసి పంపాలని ఐఏఎస్‌ అకాడమీ కోరిందని’ మంత్రి కేటీఆర్‌ వివరించారు.