సింహాచల దేవస్థాన పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్
విశాఖ సింహాచలం దేవస్థానం పాత ఈఈ మల్లేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మల్లేశ్వరరావు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో పనిచేస్తున్నారు.
Simhachalam temple news : విశాఖ సింహాచలం దేవస్థానం పాత ఈఈ మల్లేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మల్లేశ్వరరావు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో పనిచేస్తున్నారు. కాగా సస్పెన్షన్కు గల కారణాలను ఈవో వెల్లడించారు.
భైరవవాక దగ్గర్లోని సింహాచల ఆలయ భూములను ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి ఓ సంస్థకు లీజుకు ఇచ్చారు. దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత దేవస్థానానికి చేరేలా అగ్రిమెంట్ ఉంది. కాగా స్కూల్ నిర్మాణ పురోగతికి సంబంధించి దేవస్థానం ఛైర్పర్సన్ సంచయిత గజపతి ఇటీవల రిపోర్ట్ కోరారు. అయితే పనులు కంప్లీట్ కాకుండానే…పూర్తయినట్లు ఈఈగా ఉన్న మల్లేశ్వరరావు తప్పుడు నివేదిక అందజేశారు. ఈ విషయం గుర్తించి ఆయనను సస్పెండ్ చేశారు.
అయితే దీనిపై మల్లేశ్వరరావు స్పందిస్తూ.. తాను తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. 4 అంతస్థుల బిల్డింగ్ నిర్మించాల్సి ఉండగా.. 3 అంతస్థులు కంప్లీట్ అయ్యాయని.. తాను ఆ మేరకు నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు.
Also Read : నల్గొండలో ఘరానా దొంగలు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ