Water: అలెర్ట్.. ఆ సమయంలో నీరు అస్సలు తాగకూడదంట.. అలా చేస్తే పెను ప్రమాదమే..

తాగునీరు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా పరిగణిస్తారు. రోజంతా 7-8 గ్లాసుల నీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటుంటారు.

Water: అలెర్ట్.. ఆ సమయంలో నీరు అస్సలు తాగకూడదంట.. అలా చేస్తే పెను ప్రమాదమే..
Water
Follow us

|

Updated on: Feb 02, 2023 | 9:45 AM

తాగునీరు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా పరిగణిస్తారు. రోజంతా 7-8 గ్లాసుల నీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటుంటారు. మీరు కూడా పుష్కలంగా నీరు తాగితే అనేక వ్యాధుల ప్రమాదం దూరంగా ఉంటుంది. కానీ నీరు తాగడానికి సరైన సమయం కూడా చాలా ముఖ్యం. ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా కొన్ని పదార్థాలు తిన్న తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇంకా చాలా ప్రమాదకరం. ఎలాంటి పదార్థాలు తీసుకున్న తర్వాత నీళ్లు తాగకూడదు.. తాగితే ఏమవుతుంది.. అనే విషయాలను తెలుసుకుందాం.

ఎప్పుడు నీరు తాగకూడదు..

  1. పాలు: పాలు తాగిన తర్వాత నీళ్లు తాగకూడదు. ఇది మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పాల తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
  2. స్ట్రాబెర్రీ: ప్రతి ఒక్కరూ పుల్లని-తీయగా ఉండే స్ట్రాబెర్రీ పండ్లను ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, ఈ పండు తిన్న తర్వాత నీరు తాగటం చాలా హానికరం. స్ట్రాబెర్రీలో ఉండే సహజ చక్కెర, నీటి వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. ఇది ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.
  3. వేరుశనగ: వేరుశెనగలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నూనె, కొవ్వు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. దీని కారణంగా వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగడం హానికరం. వేరుశెనగ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి.
  4. జామున్ (బ్లాక్‌బెర్రీ): జామూన్ తినడానికి చాలా రుచికరంగా కనిపిస్తుంది. జామున్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జామున్ తిన్న వెంటనే నీళ్లు తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా దంతాలలో సున్నితత్వం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఆపిల్: యాపిల్‌లో ఐరన్, విటమిన్స్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తిన్న తర్వాత నీరు తాగడం మానుకోండి. యాపిల్ తర్వాత నీళ్లు తాగడం వల్ల పేగులకు హాని కలుగుతుంది.
  7. పుచ్చకాయ: పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. అయితే, చాలా మంది ప్రజలు పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగుతారు. అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పుచ్చకాయ తినడం వల్ల జీర్ణ రసం పలచబడుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..