రాహుల్కు మరోసారి హ్యాండిచ్చిన బీసీసీఐ!
Shock To KL Rahul: పరుగుల వరద పారించినా.. అద్భుతమైన ఫామ్లో ఉన్నా జట్టులో స్థానం సంపాదించడం కష్టమని మరోసారి ప్రూవ్ అయింది. కివీస్తో జరిగిన టీ20 సిరీస్లో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. రెండు అర్ధశతకాలతో 224 పరుగులు చేసి మ్యాన్ అఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో జట్టు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో రాహుల్ ఓపెనర్గా దిగాడు.ప్రతీ మ్యాచ్లోనూ పరుగులు రాబట్టి జట్టు విజయంలో […]
వన్డేల్లో ధోని స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్న రాహుల్.. టీ20ల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా జట్టుకు అన్ని విభాగాల్లోనూ ఉపయోగపడుతున్నడు. ఇంత అద్భుతంగా రాణిస్తున్నా కూడా.. అతడికి టెస్టుల్లో అవకాశం లభించట్లేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్నెస్ ఇష్యూ వల్ల కివీస్తో జరగబోయే టెస్టు సిరీస్కు జట్టును ఎంపిక చేయడంలో ఆలస్యం వహించిన బీసీసీఐ ఎట్టకేలకు ప్రకటించింది.
ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గాయంతో మిగతా సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో వన్డేలకు మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేయగా.. అనూహ్యంగా టెస్టులకు శుభ్మన్ గిల్ను తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో గిల్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. అటు న్యూజిలాండ్ ఏతో జరుగుతున్నా సిరీస్లో కూడా పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇక టెస్టుల్లో రాహుల్ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా రాహుల్కు ఇలాగే షాక్ తగిలింది. టీ20ల్లో అద్భుతంగా రాణించినా కూడా టెస్టుల్లో అవకాశం లభించలేదు.
మరోవైపు రాహుల్ మాత్రం ఎప్పటికప్పుడు తన బ్యాటింగ్ టెక్నీక్ను మారుస్తూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అటు కోహ్లీ కూడా వన్డేల్లో రాహుల్ను ఐదో స్థానంలో ప్రయత్నిస్తామని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్మన్ గిల్, పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, సాహా, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, షమీ, సైనీ, ఇషాంత్ శర్మ( నో క్లారిటీ)