ప్రధాని మోదీపై షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం…
ఎప్పుడూ ఇండియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ..మన వాళ్ల ఆగ్రహావేశాలకు కారణమయ్యే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈసారి తన పంథాను మార్చుకున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ అతడు ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనావైరస్ విస్తరిస్తోన్న వేళ మోదీ ముందస్తుగా తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం చాలా గొప్పదని అభివర్ణించాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియాలో లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదివారం హలో యాప్ వేదికగా లైవ్ సెషన్ […]
ఎప్పుడూ ఇండియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ..మన వాళ్ల ఆగ్రహావేశాలకు కారణమయ్యే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈసారి తన పంథాను మార్చుకున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ అతడు ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనావైరస్ విస్తరిస్తోన్న వేళ మోదీ ముందస్తుగా తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం చాలా గొప్పదని అభివర్ణించాడు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియాలో లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదివారం హలో యాప్ వేదికగా లైవ్ సెషన్ నిర్వహించిన ఈ అక్తర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు. తన జీవితంలో కూడా కష్టపడకుండా ఏది లభించలేదని ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్..ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా జరిగే ఛాన్సస్ కనిపించడం లేదన్నాడు. ఫ్యాన్స్ ను పెంచేందుకు పెంచుకునేందుకు తానేమీ ఇండియన్స్ ని ప్రశంసించడం లేదని చెప్పిన అక్తర్.. సరిహద్దులు ఉన్నప్పటికీ తాను అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు భారత మాజీ కెప్టెన్లు.. సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలను కూడా ప్రశంసించాడు అక్తర్.