తిరుచ్చి ఆలయంలో తొక్కిసలాట: ఏడుగురి మృతి
తిరుచ్చి: తమిళనాడు తిరుచ్చిలోని తురయ్యార్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మందికి పైగా గాయాలయినట్టు తెలుస్తోంది. చైత్రమాస ఉత్సవంలో భాగంగా హుండీలోని చిల్లరను భక్తులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో తురయ్ కరుప్పు స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో నాణేల పంపిణీ(పడికాసు) జరిగినప్పుడు.. క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో […]
తిరుచ్చి: తమిళనాడు తిరుచ్చిలోని తురయ్యార్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మందికి పైగా గాయాలయినట్టు తెలుస్తోంది. చైత్రమాస ఉత్సవంలో భాగంగా హుండీలోని చిల్లరను భక్తులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో తురయ్ కరుప్పు స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో నాణేల పంపిణీ(పడికాసు) జరిగినప్పుడు.. క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతులు కరూర్, కడలూరు, సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు.