చైనాలో మరో కొత్త అంటువ్యాధి.. ఏడుగురు మృతి !
చైనాలో పుట్టిన కరోనా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి అల్లకల్లోలం చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరో కొత్త అంటువ్యాధి బయటపడింది.
New infectious disease in China: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి అల్లకల్లోలం చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరో కొత్త అంటువ్యాధి బయటపడింది. టిక్-బార్న్ వైరస్తో కొత్త అంటువ్యాధి సోకి ఏడుగురు చనిపోయారు. మరో 60 మంది వైరస్ బారినపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. ఈ వైరస్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బాంబు పేల్చింది.
జియాంగ్ఝు కేపిటల్ సిటీ నాన్జింగ్కు చెందిన ఓ మహిళకు వైరస్ సోకగా.. ఆమెలో జ్వరం, దగ్గు వంటి సింటమ్స్ కనిపించాయని, శరీరంలో ల్యూకోసైట్, రక్తంలో ప్లేట్లెట్లు తీవ్రంగా తగ్గిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. ఒక నెల రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. అయితే.. ఎస్ఎఫ్టీఎస్ వైరస్ కొత్తది కాదని.. 2011లోనే ఈ వైరస్ను ఐడెంటిఫై చేసినట్లు మీడియా వెల్లడించింది. ఇది బన్యావైరస్ వర్గానికి చెందినదిగా తెలిపింది. కీటకాలు కుట్టడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని వైద్య నిపుణలు చెబుతున్నారు. .
Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్