కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్కు కరోనా
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా తెలిపారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా తనను కాంటాక్ట్ అయినవాళ్లందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
I have tested positive for Covid19. I request all those who came in close contact with me recently, to self isolate
— Ahmed Patel (@ahmedpatel) October 1, 2020
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులకు కరోనా సోకింది. పలువరు బీజేపీ నేతలు, కేంద్ర పెద్దలు కూడా కరోనా బారిన పడ్డారు. అమిత్ షా, నితిన్ గడ్కరీకి కూడా కోవిడ్ సోకింది. చికిత్స అనంతరం వారు వ్యాధి బారి నుంచి రికవర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కూడా రెండు రోజుల కింద కరోనా సోకింది.
Also Read :