ఎస్బీఐ షాకింగ్ డెషిసన్..హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు పెంపు..
ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. రెపో ఆధారిత హోమ్ లోన్స్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీనితో పాటు ఆస్తిని తాకట్టు పెట్టుకుని ఇచ్చే పర్సనల్ లోన్స్ పైనా వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. బాహ్య బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను(ఈబీఆర్) మాత్రం 7.05 వద్ద స్థిరంగా ఉంచింది. పెరిగిన వడ్డీ రేట్లు మే 1 నుంచే వర్తిస్తాయని ఎస్బీఐ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం వేళ… లోన్స్ […]
ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. రెపో ఆధారిత హోమ్ లోన్స్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీనితో పాటు ఆస్తిని తాకట్టు పెట్టుకుని ఇచ్చే పర్సనల్ లోన్స్ పైనా వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. బాహ్య బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను(ఈబీఆర్) మాత్రం 7.05 వద్ద స్థిరంగా ఉంచింది. పెరిగిన వడ్డీ రేట్లు మే 1 నుంచే వర్తిస్తాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.
కరోనా సంక్షోభం వేళ… లోన్స్ తీసుకున్నవారి నుంచి, రియల్టీ సంస్థల నుంచి క్రెడిట్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉందన్న మార్కెట్ వర్గాల విశ్లేషణల నేపథ్యంలో.. ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్బీఐని ఇతర బ్యాంకులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.