తిరుపతికి సరిలేరు నీకెవ్వరు టీం.. హీరోయిన్ మిస్? ఇందుకే!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన విడుదలై బంపర్ హిట్ని అందుకుంది. దీంతో.. ఈ మూవీ టీం మొత్తం.. వైకుంఠవాసుడు, శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుపతికి వెళ్తున్నారు. హీరో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి, నిర్మాతలు అనిల్ సుంకర, […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన విడుదలై బంపర్ హిట్ని అందుకుంది. దీంతో.. ఈ మూవీ టీం మొత్తం.. వైకుంఠవాసుడు, శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుపతికి వెళ్తున్నారు. హీరో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, పైడిపల్లి వంశీ కూడా వీరితో ఉన్నారు. తిరుపతి ఎయిర్పోర్టులో ఫ్లైట్ దిగి.. బస్సులో వెళ్తుండగా వీరందరూ ఫొటో దిగారు. కాగా తిరుపతి ఎయిర్పోర్టులో వీరితో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు.
శుక్రవారం ఉదయం వీరు తిరుమలేశుడి దర్శనం చేసుకోనున్నారు. సినిమా హిట్ అయిన సందర్భంగా వారు శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరితో పాటు హీరోయిన్ రష్మిక కూడా తిరుపతికి వెళ్లాలి. కానీ.. కర్నాటకలోని తన ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతోన్న సందర్భంగా ఆమె వెళ్లలేదు. అయితే చివరిలో వారితో పాటు జాయిన్ అవుతుందని సమాచారం.