Sania-Shoiab Divorse: షో అయిపోయిన తర్వాతే ఆ జంట విడాకులు తీసుకోనుందా..? సానియా ఇన్స్టాగ్రామ్ను చూస్తే..
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకుంటున్నట్లుగా ఇటీవలి కాలంలో అనేక వార్తాకథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విడిపోయారని, చాలా కాలంగా కలిసి ఉండడం లేదని..
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకుంటున్నట్లుగా ఇటీవలి కాలంలో అనేక వార్తాకథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విడిపోయారని, చాలా కాలంగా కలిసి ఉండడం లేదని రూమర్లు వచ్చాయి. పాకిస్థాన్ నటి అయేషా ఒమర్తో షోయబ్ సానియాను మోసం చేశాడని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం కానీ, ప్రకటన కానీ లేదు. ఆన్లైన్లో వెలువడిన తాజా నివేదికలు సానియా, షోయబ్ జంట విడిపోతున్నట్లు అధికారికంగా ఇంకా ప్రకటించకపోవడానికి కారణాన్ని సూచిస్తున్నాయి. ఒక జంటగా తమకు ఉన్న బాధ్యతల కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం ఆలస్యమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాటిలో ఒకటి ‘ది మీర్జా మాలిక్ షో’, ఇంకా ఒప్పందం ప్రకారం వారు ఈ సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకున్నారని పలు నివేదికలు తెలిపాయి.
షో పూర్తయిన తర్వాతే ఇద్దరూ తమ విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయగలుగుతారని అభిమానులు అనుకుంటున్నారు. సానియా మీర్జా తన ఇన్స్టాగ్రామ్లో నిరంతరం రహస్యార్థాలతో పలు పోస్ట్లను షేర్ చేస్తూ అభిమానులను, మీడియాను గందరగోళానికి గురిచేస్తుంది. మరోవైపు వారి మధ్య అంతా బాగానే ఉందని నమ్మేలా కూడా చేస్తుంది. కొన్ని రోజుల క్రితం, ఆమె తన విడాకులపై వస్తున్న వార్తలను మరింతగా పెంటేలా ‘‘హృదయం అత్యంత భారంగా ఉన్నప్పుడు మీరే విరామం ఇవ్వండి’’ అనే భావోద్వేగ లైన్లను ఇన్స్టాగ్రామ్ ద్వాదా అభిమానులతో పంచుకున్నారు. ఇంకా మరో పోస్ట్లో “కాంతి, చీకటితో తయారు చేయబడ్డ మనిషివి నువ్వు. కొద్దిగా పెళుసుగా ఉండటానికి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ గుండె అత్యంత భారంగా అనిపించే రోజుల్లో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోండి’’ అని తెలిపింది.
కాగా, సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంట విడాకులపై వస్తున్న వార్తల గురించి వారే స్వయంగా కన్ఫర్మేషన్ ఇవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు.