ఆన్లైన్లో విటుడ్ని బుక్ చేసుకున్నాడు..ఆపై రచ్చరచ్చైంది
హైదరాబాద్ ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్ శాఖలో పనిచేసే ఒక ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో..
హైదరాబాద్ ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్ శాఖలో పనిచేసే ఒక ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఆయన ఆన్ లైన్ చాటింగ్ లో ఎస్ఆర్నగర్ సమీపంలోని బస్తీకి చెందిన విటుడ్ని 5 వేలకు బుక్ చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం విటుడ్ని కలిసేందుకు ఆ అధికారి ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో బస్తీకి వచ్చాడు. ఓ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న విటుడి దగ్గరకు వెళ్లాడు. అయితే, సదరు విటుడు వికలాంగుడు కావడంతో ఒక్కసారిగా ఖంగుతిని నిర్ఘాంతపోయాడు సదరు బ్యాంకు అధికారి. దీంతో వెంటనే వెనుతిరిగిపోబోయాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం డబ్బు ఇవ్వాల్సిందేనని వికలాంగుడు పట్టుబట్టాడు. దీంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుని గొడవ పెద్దదైంది. ఇదే సమయంలో మంచినీటి సరఫరా జరుగుతుండంతో నీళ్లు పట్టుకునేందుకు బయటికి వచ్చిన మహిళలు దొంగేమోనని అనుమానించి సదరు బ్యాంక్ అధికారిని పట్టుకున్నారు. 100 కు డయల్ చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బంది విషయం తెల్సుకొని బస్తీలో న్యూసెన్సుకు పాల్పడ్డారంటూ ఇద్దరిని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.