శబరిమల దర్శనం: వారానికి ఐదు రోజులు, 250 మందికి అనుమతి.!
కరోనా లాక్డౌన్ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం దొరికింది. ఈ నెల 16వ తేదీ నుంచి మాసపూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...
Sabrimala Temple Open: కరోనా లాక్డౌన్ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం దొరికింది. ఈ నెల 16వ తేదీ నుంచి మాసపూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐదు రోజులపాటు శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రతీ రోజూ 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా.. టిక్కెట్లను ఆన్లైన్ బుకింగ్ ద్వారానే బుక్ చేసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు-టీడీబీ ప్రకటించింది. అంతేకాకుండా భక్తులు దగ్గర తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికట్ ఉండాలని స్పష్టం చేసింది.
Also Read: ఆ గుడిలో భక్తులకు బంగారమే ప్రసాదం.!
Sabarimala temple will open for pujas for 5 days from Oct 16 during Malayalam month of Thulam. Only 250 people will be allowed for darshan per day& online booking will be done on first come first served basis. Covid negative certificate will be mandatory: Travancore Devasom Board pic.twitter.com/mUBxz627y4
— ANI (@ANI) October 14, 2020