ఈనెల 16 నుంచి శబరిమల దర్శనం
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమవుతాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులకు అనుమతి
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమవుతాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తామని.. శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం తర్వాత ఈ దేవాలయాన్ని తెరవడం ఇదే మొదటిసారి.
అయ్యప్పస్వామి మాలాధారణ సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా ఓనమ్ పండుగ తర్వాత కేరళలోనూ కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. నవంబర్ 16 నుంచి శబరిమలలో మండల మకరవిలక్కు యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వస్ మోహతా నేతృత్వంలో కమిటీ ఈ కీలక సూచనలు చేసింది. దీంతో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలకు మాత్రమే భక్తులకు అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ నెల 16న దేవస్థానాన్ని తెరుస్తారు. అలాగే, ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. గరిష్ఠంగా రోజుకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంది. భక్తులు పంబకు చేరుకోవడానికి 48 గంటల ముందు పొందిన కోవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది.