శభాష్ రమేష్: అమిత్ షా
గురువారం నాడు రాజ్యసభలో ఆర్టీఐ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. కాగా ఈ బిల్లుకు తెలుగు రాష్ట్రాల పార్టీలు అయిన వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. అయితే… కాంగ్రెస్ మినహా విపక్షాలను ఒప్పించడంలో ఇటీవల టీడీపీకి టాటా చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న ఎంపీ సీఎం రమేష్ చక్రం తిప్పారు. రమేష్ చక్రం తిప్పడంతో బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించిందని.. ఆయన్ను కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్గోయల్తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు […]
గురువారం నాడు రాజ్యసభలో ఆర్టీఐ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. కాగా ఈ బిల్లుకు తెలుగు రాష్ట్రాల పార్టీలు అయిన వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. అయితే… కాంగ్రెస్ మినహా విపక్షాలను ఒప్పించడంలో ఇటీవల టీడీపీకి టాటా చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న ఎంపీ సీఎం రమేష్ చక్రం తిప్పారు. రమేష్ చక్రం తిప్పడంతో బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించిందని.. ఆయన్ను కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్గోయల్తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు శభాష్ అంటూ అభినందించారు. కాగా గత కొన్ని రోజులుగా లోక్సభలో మాత్రమే బిల్లు పాస్ అవ్వగా.. రాజ్యసభ ఆమోదం లభించక పెండింగ్లోనే ఉండిపోయిన విషయం తెలిసిందే.