జగన్ పుట్టిన రోజున మంచి పనికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రోజా.. చిన్నారికి అండగా నిలిచిన నగరి ఎమ్మెుల్యే.
ఏపీ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం దీనికి భిన్నంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
roja adopt girl on jagan b.day: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు (సోమవారం) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తమ నాయకుడి పుట్టిన రోజును పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉంటే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం దీనికి భిన్నంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పి.పుష్ప కుమారి అనే చిన్నారిని రోజా దత్తత తీసుకొని తన మంచి మనసును చాటుకున్నారు. మెడిసిన్ చదవాలని కోరిక ఉందన్న పుష్ప కుమారి కలను నిజం చేయడానికి మెడిసిన్ చదువులకయ్యే ఖర్చును తానే భరిస్తానని రోజా హామీ ఇచ్చారు.
మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..!
మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు @ysjagan అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది.
పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది.#HBDYSJagan#HBDBestCMYSJagan pic.twitter.com/dQUu8rWZer
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2020
దత్తత తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రోజా.. ‘మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన మోహన్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది. హ్యాపీ బర్త్డే జగన్’ క్యాప్షన్ జోడించారు.