IPl 2020 : రోహిత్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్
గ్రౌండ్ లోకి దిగాడంటే చాలు వీర బాదుడే అతని లక్ష్యం. వన్డేలు, టెస్టుల్లో కూడా అదే దూకుడు కొనసాగించడం అతడి నైజం. అందుకే రికార్డులన్నీ అతడికి దాసోహం.
గ్రౌండ్ లోకి దిగాడంటే చాలు వీర బాదుడే అతని లక్ష్యం. కేవలం టీ20లలో మాత్రమే కాదు, వన్డేలు, టెస్టుల్లో కూడా అదే దూకుడు కొనసాగించడం అతడి నైజం. అందుకే రికార్డులన్నీ అతడికి దాసోహం. ఇప్పటికే అతడెవరో మీరు తెలిసిపోయే ఉంటుంది. అవును మేము మాట్లాడుతుంది ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించే. తాజాగా ఈ క్రేజీ ప్లేయర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 5 వేల పరుగుల మార్కు అందుకున్న మూడో క్రికెటర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలు ఇతడికంటే ముందున్నారు.
ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్లో 4,998 పరుగులతో ఉన్న హిట్ మ్యాన్.. పంజాబ్తో జరుగుతోన్న మ్యాచ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టి 5 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 180 మ్యాచ్ల్లో 5,430 పరుగులతో ఫస్ట్ ప్లేసులో ఉండగా, రైనా 193 మ్యాచ్ల్లో 5,368 పరుగులతో సెకండ్ ప్లేసులో నిలిచాడు నిలిచాడు. రోహిత్కు ఈ మ్యాచ్ 191వది.
Also Read :