టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. త్వరలోనే ఆస్ట్రేలియా పయనం.!
టీమిండియా ఫ్యాన్స్కు అదిరిపోయే శుభవార్త. హిట్మ్యాన్ రోహిత్ శర్మ తన గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయం...
టీమిండియా ఫ్యాన్స్కు అదిరిపోయే శుభవార్త. హిట్మ్యాన్ రోహిత్ శర్మ తన గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయం నుంచి రోహిత్ శర్మ కోలుకున్నాడని.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడని జాతీయ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో రోహిత్ శర్మ ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
గాయం నుంచి కోలుకున్నా.. హిట్మ్యాన్ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడని పూర్తి ఫిట్నెస్ స్టాండర్డ్స్ సాధించడం కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. 2020లో కూడా పలుమార్లు గాయపడిన రోహిత్ శర్మ.. 2021లో ఎలాంటి గాయాలు లేకుండా నాన్స్టాప్ క్రికెట్ ఆడేలా తనను తాను రెడీ చేసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది. కాగా, రోహిత్ శర్మ గడువు లోపు పూర్తి ఫిట్నెస్ సాధిస్తే టెస్ట్ సిరీస్ ఆడే అవకాశం ఉంది.