ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. పలువురికి తీవ్రగాయాలు. ఎనిమిది కార్లు ధ్వంసం

తమిళనాడు ధర్మపురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. రెండు కిలోమీటర్ల దూరం..హైవేపై ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది....

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. పలువురికి తీవ్రగాయాలు. ఎనిమిది కార్లు ధ్వంసం
Follow us

|

Updated on: Dec 12, 2020 | 6:16 PM

అతివేగంతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. హైవేపై వెళుతోన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. బ్రిడ్జి మీద ఈ ఘటన జరగడంతో ప్రమాద తీవ్రత తీవ్రంగా ఉంది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఎనిమిది కార్లు ధ్వంసమయ్యాయి.  వేగంగా వెనుక వస్తోన్న వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొని జాతీయరహదారిపై ప్రమాదం సినీ ఫక్కీని తలపించింది. ధర్మపురం – సేలం రహదారిపై భారీ కంటైనర్ ను, సిమెంట్ ట్రైలర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఈ ప్రమాదంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికుల సాయంతో హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టిన అధికారులు నుజ్జునుజ్జయిన కార్లలో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు. ఇప్పటి వరకు 10 మందిని బయటకు తీయగా, ఇంకా వాహనాల్లో ఇరుక్కున్న క్షత గాత్రులను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరు నుంచి చెన్నై వస్తున్న లేన్ లో ఈ ప్రమాదం నెలకొంది. తమిళనాడు ధర్మపురి జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.