ప్రేమించిన యువతిని మరవలేక ఆర్ఎంపీ ఆత్మహత్య
అతడికి పెళ్లైంది. కానీ ప్రేమించిన యువతిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి లోనై, తనువు చాలించాడు ఓ ఆర్ఎంపీ డాక్టర్.
అతడికి పెళ్లైంది. కానీ ప్రేమించిన యువతిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి లోనై, తనువు చాలించాడు ఓ ఆర్ఎంపీ డాక్టర్. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలం, ఎల్లాపురం గ్రామానికి చెందిన దున్నా ఉదయ్కుమార్ (27) ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. ఈనెల 16వ తేదీన సిటీకి వచ్చి రాత్రి 9 గంటల సమయంలో ఎల్బీనగర్ రింగ్రోడ్డులోని ఓ లాడ్డిలో దిగాడు. శనివారం మధ్యా హ్నం వరకు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ స్టాఫ్ డోర్ కొట్టగా తీయలేదు. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డోర్ బద్దలు కొట్టి చూడగా చూడగా నైలాన్ తాడుతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఉదయ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఉదయ్కుమార్ రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉదయ్కుమార్ తన పెళ్లికి ముందే ఓ యువతిని ప్రేమించాడని.. ఆమెను మరచిపోలేక మానసిక ఒత్తిడికి గురై సూసైడ్కు పాల్పడినట్లు లెటర్లో రాశాడని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువు జానిబాబు కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.( Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు ! )