బయటపడుతోన్న రేవంత్ బంధువుల అక్రమాలు…!
రేవంత్రెడ్డి అక్రమాలే కాదు, ఆయన బంధువుల అక్రమాలను కూడా బయటపెడుతున్నామన్నారు టీఆర్ఎస్ నేతలు. చేపల వ్యాపారం పేరుతో రేవంత్రెడ్డి వియ్యంకుడు జి.వెంకట్రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేత కృశాంక్ ఆరోపించారు. జి.వెంకట్రెడ్డి పెట్టిన కంపెనీలు , వాటిల్లో జరుగుతున్న అక్రమాల గుట్టు విప్పుతామన్నారు. దేశంలో ఏది జరిగినా కేటీఆర్కు ఆపాదించడం రేవంత్ నైజమని, ఇంటర్మీడియట్ బోర్డు విషయంలోనూ లేనిపోని ఆరోపణలు చేశారని కృశాంక్ చెప్పారు. కామెరూన్ ఫుడ్స్ పేరుతో రేవంత్రెడ్డి కూతురు, అల్లుడు కలిసి ఓ కంపెనీ […]
రేవంత్రెడ్డి అక్రమాలే కాదు, ఆయన బంధువుల అక్రమాలను కూడా బయటపెడుతున్నామన్నారు టీఆర్ఎస్ నేతలు. చేపల వ్యాపారం పేరుతో రేవంత్రెడ్డి వియ్యంకుడు జి.వెంకట్రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేత కృశాంక్ ఆరోపించారు. జి.వెంకట్రెడ్డి పెట్టిన కంపెనీలు , వాటిల్లో జరుగుతున్న అక్రమాల గుట్టు విప్పుతామన్నారు. దేశంలో ఏది జరిగినా కేటీఆర్కు ఆపాదించడం రేవంత్ నైజమని, ఇంటర్మీడియట్ బోర్డు విషయంలోనూ లేనిపోని ఆరోపణలు చేశారని కృశాంక్ చెప్పారు. కామెరూన్ ఫుడ్స్ పేరుతో రేవంత్రెడ్డి కూతురు, అల్లుడు కలిసి ఓ కంపెనీ స్థాపించి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గోల్డ్ సిటీ ఎస్టేట్స్లో వాళ్లంతా డైరెక్టర్స్గా ఉన్నారన్నారు. నెక్సస్ ఫుడ్ పేరుతో పెట్టిన కంపెనీకి అసలు లెక్కలే లేవన్నారు. 18 కోట్ల రూపాయల లెక్కలు చూపించలేదన్నారు కృశాంక్.