2021 రిటైర్మెంట్… పదవీ విరమణ చేయనున్న ఐదుగురు పోలీస్ బాస్లు.. ఎవరెవరంటే…
తెలంగాణ సర్వీస్ క్యాడర్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు 2021లో రిటైర్ కాబోతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సర్వీస్ క్యాడర్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు 2021లో రిటైర్ కాబోతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2001 బ్యాచ్కు చెందిన పి. ప్రమోద్ కుమార్ ఐపీఎస్, ఐజీపీ సీఐడీ మే 31, 2021న పదవీ విరమణ పొందనున్నారు. 1987 బ్యాచ్కు చెందిన గోపికృష్ణ జులై 31, 2021న రిటైర్ అవ్వనున్నారు. ప్రస్తుతం ఆయన అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు.
1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పూర్ణచందరరావు ప్రస్తుతం ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఆగస్టు 31న పదవీ విరమణ పొందనున్నారు. ఇక 1986 బ్యాచ్కు చెందిన రాజీవ్ త్రివేది ప్రస్తుతం జైళ్ల శాఖ డైరెక్టర్గా ఉన్నారు. రాజీవ్ త్రివేది సెప్టెంబర్ 30న రిటైర్ అవ్వనున్నారు. 2002 బ్యాచ్కు చెందిన శివశంకర్రెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ రేంజ్ ఐజీపీగా ఉన్నారు. ఆయన నవంబర్ 30న పదవీ విరమణ పొందనున్నారు.