ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో డిప్యూటేషన్పై ఖాళీల భర్తీ
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ విద్యా సంస్థల్లోని ఖాళీలను డిప్యూటేషన్పై భర్తీ చేయాలని డిసైడయ్యింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ విద్యా సంస్థల్లోని ఖాళీలను డిప్యూటేషన్పై భర్తీ చేయాలని డిసైడయ్యింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఖాళీల భర్తీపై కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నందున బీఈడీ, డీఈడీ కాలేజీల్లో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లాస్థాయిలో జిల్లా విద్యాధికారి కన్వీనర్, సంయుక్త కలెక్టర్ ఛైర్మన్గా, సంబంధిత విద్యా సంస్థ ప్రిన్సిపల్ మెంబర్స్ గా కమిటీ ఏర్పాటు చేస్తారు.
శనివారం దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 25 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 2 నుంచి 6 వరకు అప్లికేషన్స్ పరిశీలించి ఫైనల్ లిస్ట్ సిద్ధం చేస్తారు. 7న డిప్యూటేషన్ ఉత్తర్వులు విడుదల చేస్తారు.
ఎస్సీఈఆర్టీలోనూ అదే మాదిరిగా..
మరోవైపు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ)లో కూడా ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్పై భర్తీ చేయాలని ప్రభుత్వం డిసైడయ్యింది. బీఈడీ, డైట్ కాలేజీల్లో వర్క్ చేసే సీనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు అప్లై చేసుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ తెలిపింది.