కరోనా ఎఫెక్ట్: ఈఎంఐ ఆలస్యమైందా..డోంట్ వర్రీ..?
ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇండియా అంతా లాక్డౌన్లో ఉంది. నేటి (బుధవారం) నుంచి 21 రోజులపాటు లాక్డౌన్ కొనసాగనుంది. దీంతో ఎన్నో రంగాల కుదేలయ్యాయి. ప్రజల వ్యక్తిగత, ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకే ఈఎంఐలు, ఇతర చెల్లింపుల లేటయినా ఎటువంటి అధిక చెల్లింపులు లేకుండా ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో దాదాపు 80 శాతం వ్యక్తుల […]
ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇండియా అంతా లాక్డౌన్లో ఉంది. నేటి (బుధవారం) నుంచి 21 రోజులపాటు లాక్డౌన్ కొనసాగనుంది. దీంతో ఎన్నో రంగాల కుదేలయ్యాయి. ప్రజల వ్యక్తిగత, ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకే ఈఎంఐలు, ఇతర చెల్లింపుల లేటయినా ఎటువంటి అధిక చెల్లింపులు లేకుండా ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో దాదాపు 80 శాతం వ్యక్తుల ఆదాయ, వ్యయాలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, డైలీ వర్కర్ల ఆదాయ మార్గాలపై దారుణ ఎఫెక్ట్ ఉంది. అందుకే లోన్స్, ఈఎంఐల విషయంలో ఆలస్యమైనా అనుమతులు ఇవ్వాలని డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ బ్యాంకులు సంఘం చర్చలు జరిపింది. త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..ప్రస్తుతం ఉన్న విపత్కర సమయంలో చాలామందికి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఏటీఎంలలో కూడా మనీ విత్డ్రా చేసుకున్నా ఛార్జీలు ఉండవని తెలిపారు. బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను తొలిగించారు. జూన్ వరకు ఈ సడలింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.