కేరళలో ఏనుగు మరణంపై.. రతన్ టాటా సంచలన ట్వీట్..
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేరళలో గర్భిణీ ఏనుగు హత్యను తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొన్నారు. మలప్పురంలోని స్థానికులు ఏనుగుకు పేలుడు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేరళలో చోటుచేసుకున్న గర్భిణీ ఏనుగు హత్యను తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొన్నారు. మలప్పురంలోని స్థానికులు ఏనుగుకు పేలుడు పదార్థాలతో నిండిన పైనాపిల్ను తినిపించగా, భరించలేని నొప్పితో ఆ ఏనుగు ఒక నదిలో నిలబడి చనిపోయింది. రతన్ టాటా ఏనుగుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దారుణ సంఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
“ఒక సమూహానికి చెందిన కొందరు వ్యక్తులు.. గర్భవతి అయిన ఏనుగుకు పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ తినిపించడం వల్ల మరణించిందని తెలిసి నేను షాక్ అవుతున్నాను. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలు సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు, మరణించిన ఏనుగుకు న్యాయం జరగాలి ” అని రతన్ టాటా తన పోస్ట్లో పేర్కొన్నారు.
[svt-event date=”04/06/2020,12:55PM” class=”svt-cd-green” ]
— Ratan N. Tata (@RNTata2000) June 3, 2020
[/svt-event]
Also Read: టెన్త్ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..