Bus Accident: కళ్లముందే కుటుంబ సభ్యులు అగ్నికి అహుతి.. కలిబురిగి బస్సు ప్రమాదానికి కారణం ఇదే..
Karnataka Bus Accident: సొంత కుటుంబ సభ్యుల కళ్ళ ముందే నలుగురు మంటల్లో సజీవ దహనమయ్యారు. నలుగురు స్పాట్లోనే అగ్ని కీలలకు ఆహుతైతే, మరో ముగ్గురు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృత్యువాత పడ్డారు.
కర్నాటక కలిబురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణలో కలకలం రేపింది. చిన్నారి బర్త్డే పార్టీ విషాదాంతం అయ్యింది. ఐదు రోజుల పాటు బర్త్డే టూర్ కోసం గోవా వెళ్ళిన కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది. ఈ ఘోర ప్రమాదం 5 మందిని బలితీసుకుంది. సొంత కుటుంబ సభ్యుల కళ్ళముందే ఏడుగురు మంటల్లో సజీవ దహనమయ్యారు. నలుగురు బస్సుని చుట్టుముట్టిన అగ్ని కీలలకు ఆహుతైతే, మరోవ్యక్తి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృత్యువాత పడ్డారు. నిన్న సాయంత్రం 6:30 నిముషాలకు గోవా లో బయలుదేరిన బస్సు కలబురిగి దగ్గర కల్వర్టుని ఢీకొట్టి 50 అడుగుల ఎత్తునుంచి గుంటలో పడిపోయింది. బాధిత మహిళ కల్పన చెప్పిన దాన్ని బట్టి పిల్లల్తో కలిపి మొత్తం బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నారు. అందులో పిల్లలు సైతం ఉన్నారు. మే 28న హైదరాబాద్నుంచి బస్సు బయలుదేరింది. బర్త్ డే వేడుకలని ఉత్సాహంగా జరుపుకొని, హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో నుంచి ఎందరు బయటపడ్డారో తెలియదని బాధిత మహిళ చెప్పింది.
బస్సు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. 19మంది తీవ్ర గాయాలతో కలబురిగిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా హైదరాబాద్ వాసీయులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలుగా తెలుస్తుంది. మృతులు అర్జున్ కుమార్, సరళ,అనిత, రవళి, శివ, వివాన్, దీక్షిత్ లు గుర్తించారు.
అయితే ఫాస్ట్ డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణమా? అదే అనుమానం నిజమంటున్నాడు డ్రైవర్ అమృత్. నిజం నిగ్గు తేలాల్సి ఉంది. సరిగ్గా తెల్లవారు ఝామున 5:30 నిముషాల వరకు అమృత్ అనే డ్రైవర్ బస్సునడిపారు. యాక్సిడెంట్కి కొద్ది నిముషాల ముందే డ్రైవర్ మారినట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న డ్రైవర్ చెప్పారు.
నిన్న సాయంత్రం 6:30 గంటలకి గోవాలో బస్సు బయలుదేరింది. మొదట బస్సు నడిపిన డ్రైవర్ రాష్గా బస్ డ్రైవర్ చేస్తున్న విషయాన్ని గమనించి మెల్లిగా వెళ్ళాలని ప్రయాణికులు కోరారు. ఆ తరువాత మళ్ళీ స్టీరింగ్ మొదటి సారి డ్రైవింగ్ చేసిన బస్సు డ్రైవర్ చేతికే వెళ్ళడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.