బాబాయ్ కు దన్నుగా అమ్మ తులసి పూజతో ముందుకొచ్చిన చెర్రీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఆకర్షణీయమైన ట్వీట్ తో ముందుకొచ్చారు. తన తల్లి సురేఖ తులసికోటకి దీపం వెలిగించి పూజ చేస్తున్న ఫొటోను ఉంచి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత అంటూ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఆకర్షణీయమైన ట్వీట్ తో ముందుకొచ్చారు. తన తల్లి సురేఖ తులసికోటకి దీపం వెలిగించి పూజ చేస్తున్న ఫొటోను ఉంచి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత అంటూ సందేశమిచ్చారు. దీనికి భారతీయ కల్చర్ మేటర్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు. కాగా, ధర్మాన్ని పరిరక్షిద్దాం, మతసామరస్యాన్ని కాపాడుదాం అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాత ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ, మిగతా మతాలను సహనంగా చూడడమే పరమత సహనం అని పవన్ పేర్కొన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన తెలియజేస్తూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి 6.30 మధ్య దీపాలను వెలిగిద్దామంటూ పవన్ ఇచ్చిన పిలుపు మేరకు రామ్ చరణ్ ఈ పోస్ట్ పెట్టినట్టు కనిపిస్తోంది.
దర్యాప్తు అంటే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే , మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. దాని వైపు వేసే తొలి అడుగే … pic.twitter.com/zgMNjsHKUx
— Pawan Kalyan (@PawanKalyan) September 10, 2020
మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత…. #Bharathiya_Culture_Matters pic.twitter.com/Mi5Bl3k8nY
— Ram Charan (@AlwaysRamCharan) September 11, 2020