Murder Movie : ‘మర్డర్’ సినిమా తీయడానికి గల కారణం చెప్పిన వర్మ..22న మిర్యాలగూడలో నడి రోడ్డుపై ప్రెస్ మీట్
'మర్డర్' సినిమా తీయడానికి గల కారణం ఏంటో మళ్లీ వివరించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మారుతీరావు, అమృత ఇన్సిడెంట్ జరిగినప్పుడు...
‘మర్డర్’ సినిమా తీయడానికి గల కారణం ఏంటో మళ్లీ వివరించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మారుతీరావు, అమృత ఇన్సిడెంట్ జరిగినప్పుడు తాను కూడా నెగిటివ్గా రియాక్ట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ.. ఈ ఘటన వెనుక అసలు నేపథ్యాన్ని తర్వాత కనుగొన్నట్లు చెప్పారు. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉండాల్సిన రిలేషన్ గురించి చాలా స్టడీ చేశానని వివరించారు. ‘మర్డర్’ సినిమా.. మారుతీరావు కథకు సంబంధించింది కాదని ..ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నారు. అసలు విషయం తెలియక కోర్టుకెక్కారని.. కుటుంబ గౌరవాన్ని చెడగొడ్తున్నారన్న భావోద్వేగాలు మానవ సహజం అని వ్యాఖ్యానించారు. మోరల్, లీగల్, ఎథికల్ డైలమాస్ మధ్యలో వున్న సన్నటి గీత మీదే ‘మర్డర్’ సినిమా నేపథ్యం ఉంటుందని స్పష్టం చేశారు. 22న మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యామని..అయితే అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామన్నది అప్పుడే చెబుతానన్నారు వర్మ.
Also Read :
ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి
కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్లోనే అత్యల్పం