Big Story: రాజస్తాన్..సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుకి సీఎల్పీ మద్దతు.. తీర్మానం ఆమోదం

రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్ఫీ) మద్దతు ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వారిపై గట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానంలో కోరారు. కాగా-తమ ఎమ్మెల్యేలను..

Big Story: రాజస్తాన్..సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుకి సీఎల్పీ మద్దతు.. తీర్మానం ఆమోదం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 13, 2020 | 5:27 PM

రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) మద్దతు ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వారిపై గట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానంలో కోరారు. కాగా-తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టకుండా గెహ్లాట్ వారిని జైపూర్ బయట ఓ రిస్సార్టుకు తరలించారు. తనకు 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ప్రకటించుకున్నారు. సోమవారం ఉదయం వీరితో ఆయన తన ‘బలాన్ని’ ప్రదర్శించారు. గెహ్లాట్ నిర్వహించిన ఈ సమావేశానికి సుమారు 102 మంది శాశన సభ్యులు హాజరయ్యారు. అటు-గెహ్లాట్ ప్రభుత్వంపై బాహాటంగా తిరుగుబాటు చేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలట్… ఢిల్లీలో తనకు మద్దతు నిస్తున్న ఎమ్మెల్యేలతో పార్టీ సీనియర్ నేతలను కలుసుకుంటున్నారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకుంటున్న ఆయన.. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, సీఎం తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పిలుపుతో పైలట్ వారితో భేటీ అయ్యారు. జైపూర్ కి వెళ్లాలని, ప్రభుత్వంతో రాజీ పడాలని వారు ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. పైలట్.. ఇతర నేతలైన కెసి. వేణుగోపాల్, అహ్మద్ పటేల్, పి.చిదంబరం లను కూడా కలిశారు. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ నేతలు తమ కొత్త డిమాండ్ బయట పెట్టారు.  .

200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో 107 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. పది మంది ఇండిపెండెంట్ సభ్యులు కూడా గెహ్లాట్ సర్కార్ కి మద్దతునిస్తున్నారు. బీజేపీ నుంచి 73 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే.. ఈ పార్టీకి మరో 35 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. పార్టీ ఆదేశంపై పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా జైపూర్ చేరుకొని సంక్షోభ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!