అనుమతి లేకుండా ప్రయాణిస్తే రూ.200 జరిమానా..!

ఇకపై రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. ఇకపై టికెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా తప్పదంటున్నారు రైల్వే అధికారులు.

అనుమతి లేకుండా ప్రయాణిస్తే రూ.200 జరిమానా..!
Follow us

|

Updated on: Oct 12, 2020 | 6:19 PM

ఇకపై రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. ఇకపై టికెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా తప్పదంటున్నారు రైల్వే అధికారులు. సబర్బన్‌ రైళ్లలో అనుమతి లేకుండా ప్రయాణించే వారికి రూ.200 జరిమానా విధిస్తామని దక్షిణ రైల్వే హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు, సరుకుల రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. గత నెలలో దాదాపు కోటి మంది ప్రయాణికులను వారివారీ గమ్యస్థానాలకు చేరుకున్నారు. చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వే పరిధిలో సుమారు 10 లక్షల మంది ప్రయాణించారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

అయితే, చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 42 ప్రత్యేక సబర్బన్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లలో ప్రభుత్వ అనుమతి పొందిన ఉద్యోగులు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేశారు. అయితే, సబర్బన్‌ రైళ్లలో ప్రజలు, వ్యాపారులు, కొన్ని ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్లు ఫిర్యాదులందాయి. దీంతో రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అయినప్పటికీ సబర్బన్‌ రైళ్లలో ప్రయాణాన్ని ప్రజలు మానడం లేదు. అలాగే, రైళ్లలో రద్దీ కూడా పెరుగుతుండడతో కరోనా ప్రబలే అవకాశముంది. దీన్ని అడ్డుకొనేందుకు అనుమతి లేకుండా ప్రభుత్వ గుర్తింపుకార్డులు లేకుండా ప్రయాణించే వారికి రూ.200 నుంచి రూ.270 వరకు జరిమానా విధించాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసమే నడుపుతున్న సబర్బన్‌ రైళ్లలో ప్రజలు ప్రయాణించరాదని దక్షిణ రైల్వే విజ్ఞప్తి చేసింది.